‘‘భార్య అదృశ్యం వెనక కుట్ర.. పోలీసులకు 48 గంటల డెడ్‌లైన్’’.. కూతుళ్లతో కలిసి అజ్ఞాతంలోకి..

By Sumanth KanukulaFirst Published Jun 25, 2022, 4:31 PM IST
Highlights

తన భార్య కనిపించుకుండా పోయిన పోలీసులు ఇప్పటివరకు ఆచూకీ కనిపెట్టడం లేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని సెల్పీ వీడియోలో రికార్డు చేసి తన కూతుళ్లతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది.

తన భార్య కనిపించుకుండా పోయిన పోలీసులు ఇప్పటివరకు ఆచూకీ కనిపెట్టడం లేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని సెల్పీ వీడియోలో రికార్డు చేసి తన కూతుళ్లతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. వివరాలు.. వికారాబాద్‌ జిల్లా తాండూరులో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు దొరిశెట్టి సత్యమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. మూడు నెలల క్రితం తన భార్య ఆచూకీ లభించడం లేదని చెప్పాడు. పోలీసులు వైఫల్యం వల్లనే తన భార్య ఆచూకీ దొరకలేదని ఆరోపించాడు. తన భార్య అదృశ్యం వెనక కుట్ర, పెద్దల హస్తం ఉందని ఆరోపించాడు. 

 తన భార్య ఆచూకీ లభించకపోతే తాను తమ పిల్లలు ఈ భూమ్మీద ఉండలేమని సత్యమూర్తి పేర్కొన్నాడు. తన భార్యను 48 గంటల్లోగా కనిపెట్టాలని లేదంటే.. తర్వాత గంటల తర్వాత తమ శవాలు ఉన్న లొకేషన్ షేర్ చేస్తా అంటూ సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ఆ వీడియోలో సత్యమూర్తి కూతుళ్లు తమ తల్లి ఆచూకీని గుర్తించాలని కోరారు. అమ్మ లేని లోకంలో ఉండలేమని చెప్పారు. ఇన్నాళ్లు తమ తల్లి ఉందనే నమ్మకంతోనే ఉన్నామని.. ఆమె లేదని తెలిస్తే తాము బతకలేమని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వం తమ తల్లిని గుర్తించేందుకు సహకరించాలని కోరారు. అనంతరం వారు అజ్ఞాతంలోకి వెల్లిపోయారు. 

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. . సమాచారం తెలుసుకున్న పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్లిన సత్యమూర్తి, అతని కూతుళ్ల ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, సత్యమూర్తి కుటుంబం తాండూరులో నివాసం ఉంటుంది. సత్యమూర్తి భార్య అన్నపూర్ణ ఈ ఏడాది మార్చిలో కనిపించకుండా పోయింది. దీంతో సత్యమూర్తి పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు సత్యమూర్తి కుటుంబ సభ్యులు కూడా పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అయినప్పటకీ ఆమె ఆచూకీ లభించలేదని సమాచారం. 

click me!