
ఉన్న సచివాలయానికే సక్కగ రావు కొత్త సచివాలయం ఎందుకు కడుతున్నారో కేసిఆరే చెప్పాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత విహెచ్. అమరావతి లో బాబు బిల్డింగ్ కడుతున్నారని కేసీఆర్ ఇక్కడ కొత్తవి కట్టాలని అనుకుంటే సరికాదన్నారు.
ఉన్న సచివాలయనికే రాని కేసీఆర్ కు కొత్త సచివాలయమ ఎందుకు.? అని విహెచ్ నిలదీశారు. ప్రజా సొమ్మును ఖర్చు పెట్టడానికి మీరరెవరు? తెలంగాణ ఏమైనా మీ జాగిరా అని ప్రశ్నించారు. సచివాలయం ఎలా కడతావో నేను చూస్తా అని హెచ్చరించారు.
నగరంలో కొత్త సచివాలయంపై ప్రజాభిప్రాయం తీసుకుంటామన్నారు. ప్రజల ముందు బ్యాలెట్ పేపర్ పెడతాం. కొత్త సచివాలయంపై మంత్రి తుమ్మల కాదు దమ్ముంటే కేసీఆర్ మాట్లాడాలని సవాల్ చేశారు. మూడేళ్లలో ఏన్ని ఉద్యోగాలు ఇచ్చావో వైట్ పేపర్ విడుదల చేయి అని కేసిఆర్ కు సవాల్ విసిరారు వి.హన్మంతరావు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి