వనస్థలిపురం దోపిడి కేసులో పురోగతి: దొంగలు వీళ్లే

Siva Kodati |  
Published : May 08, 2019, 10:23 AM IST
వనస్థలిపురం దోపిడి కేసులో పురోగతి: దొంగలు వీళ్లే

సారాంశం

హైదరాబాద్ వనస్థలిపురంలో మంగళవారం యాక్సిస్ బ్యాంక్ వద్ద రూ. 70 లక్షల చోరీ కేసులో దోపిడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు

హైదరాబాద్ వనస్థలిపురంలో మంగళవారం యాక్సిస్ బ్యాంక్ వద్ద రూ. 70 లక్షల చోరీ కేసులో దోపిడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. వీరిని తమిళనాడుకు చెందిన రాంజీనగర్ గ్యాంగ్‌గా గుర్తించారు.

ఐదుగురు సభ్యుల ఈ ముఠాపై గతంలో బెంగళూరు, చెన్నైలలో పలు చోరీ కేసులు నమోదైనట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. అలాగే పలు ఏటీఎంల దగ్గర సైతం ఈ గ్యాంగ్ చోరీలకు పాల్పడినట్లుగా తేల్చారు. వనస్థలిపురంలో బ్యాంక్ దోపిడి అనంతరం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రస్తుతం వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక ఊపిరి పీల్చుకోండి.. రూ. 700 కోట్ల‌తో భారీ ఫ్లై ఓవ‌ర్‌. ఈ ప్రాంతంలో ఊహించ‌ని మార్పు
Indian Air Force Jobs : కేవలం తెలుగు యువతకు మాత్రమే.. ఇంటర్ అర్హతతోనే భారత వాయుసేనలో ఉద్యోగావకాశాలు