నాకు సంబంధం లేదు: రామకృష్ణ కుటుంబం సూసైడ్‌పై ఎమ్మెల్యే వనమా కొడుకు రాఘవేంద్ర

By narsimha lodeFirst Published Jan 3, 2022, 10:33 PM IST
Highlights

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్ర చెప్పారు.ఈ మేరకు ఓ వీడియోను రాఘవేంద్ర మీడియాకు రిలీజ్ చేశారు. 
 


ఖమ్మం: Palwanchaలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొత్తగూడెం ఎమ్మెల్యే vanama venkateswara rao  తనయుడు vanama Raghavendra rao స్పష్టం చేశారు.  ఈ మేరకు ఆయన ఓ Videoను మీడియాకు రిలీజ్ చేశారు. Ramakrishna తన భార్యా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకొన్నాడు. అయితే ఈ ఘటనో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలో  80 శాతం కాలిన గాయాలతో ఓ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.   తన కుటుంబం చావుకు నవమా రాఘవేంద్రతో పాటు తన తల్లి, తన సోదరి కూడా కారణమని రామకృష్ణ 'సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

also read:పాల్వంచ సూసైడ్ కేసులో ట్విస్ట్: ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవేంద్రపై కేసు

వనమా రాఘవేంద్ర పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఈ సమయంలో వనమా రాఘవేందర్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఎన్నో పనుల కోసం తమ ఇంటికి వస్తారని చెప్పారు. తల్లికి అన్యాయం చేయవద్దని రామకృష్ణకు చెప్పానని వనమా రాఘవేందర్ చెప్పారు. అయితే ఇలా చెప్పడం తప్పా అని రాఘవేందర్ ప్రశ్నించారు. తన పేరును రామకృష్ణ ఎందుకు రాశాడో తనకు తెలియడం లేదన్నారు.  రామకృష్ణ కుటుంబం తనకు తెలుసునని చెప్పారు.  Suicide లేఖలో తన పేరు రాయడం తనకు బాధ కల్గిస్తోందన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో రామకృష్ణ ఆత్మహత్య చేసుకొంటే తనకు ఎలాంటి  సంబందం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా అప్రతిష్టపాల్జేసేందుకు చేసే కుట్రలో భాగంగానే తన పేరును ఇందులో ఇరికించారన్నారు.

రామకృష్ణ ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రామకృష్ణను ప్రేరేపించి తనను ఇబ్బందిపాల్జేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఎలాంటి విచారణకైనా తాను సిద్దమేనని ఆయన చెప్పారు.

అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఈ లేఖలో తన చావుకు తన తల్లి, సోదరి తో పాటు ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్ర కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే   తనయుడు రాఘవేంద్ర వేధింపుల కారణంగానే చనిపోతున్నట్టుగా రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్ర పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు.  గతంలో ఓ కేసులో ముందస్తు బెయిల్ తో రాఘవేంద్ర బయటుకు వచ్చాడు. అయితే ప్రస్తుతం మరోసారి రామకృష్ణ  తన కుటుంబంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై  రాఘవేంద్ర పై మరో కేసును నమోదు చేశారు  పోలీసులు.

పాల్వంచలో గతంలో రామకృష్ణ మీ సేవా కేంద్రం నిర్వహించేవారు.  రెండు నెలల క్రితం ఈ మీ సేవా కేంద్రాన్ని రామకృష్ణ అమ్మేశాడు.  ఆ తర్వాత ఆయన రాజమండ్రికి నివాసాన్ని మార్చాడు.  రెండు రోజుల క్రితం రామకృష్ణ, భార్య పిల్లలతో కలిసి పాల్వంచకు వచ్చాడు.  ఆదివారం నాడు రాత్రి కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో చిన్నారి సాహితి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వ్యాపారాలు కలిసి రాకపోవడంతో పాటు ఆన్‌లైన్ వ్యాపారాల్లో రూ. 80 లక్షలకు పైగా నష్టం వచ్చినట్టుగా రామకృష్ణ సన్నిహితులు చెబుతున్నారు. 

అయితే రామకృష్ణ ఆత్మహత్య చేసుకొన్న ఇంటిని కూడా విక్రయించాలని భావించాడు. అయితే ఈ విషయమై తల్లి అడ్డు చెబుతుందని తెలిసింది. రామకృష్ణకు సోదరి కూడా ఉంది. ఆమెకు భర్త లేడు. దీంతో ఆస్తి విషయమై రామకృష్ణతో వివాదం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయమై పెద్ద మనుషుల మధ్య పంచాయితీ నిర్వహించారని సమాచారం. అయితే రామకృష్ణ సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు..


 

click me!