మునుగోడు ఉపఎన్నిక... టీఆర్ఎస్‌పై ఈసీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫిర్యాదు

Siva Kodati |  
Published : Oct 26, 2022, 06:49 PM IST
మునుగోడు ఉపఎన్నిక... టీఆర్ఎస్‌పై ఈసీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫిర్యాదు

సారాంశం

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీపై ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్. గులాబీ దళం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. ప్రభుత్వ వాహనాలను కూడా ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు ధర్మేంద్ర ప్రదాన్. 

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది బీజేపీ. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో నకిలీ నోట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ దృష్టికి ప్రదాన్ తీసుకెళ్లారు. ఇప్పటికే 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని, మరో 14 వేల ఓట్లు తొలగించాల్సి వుందని చెప్పారు. అలాగే మునుగోడు ఎన్నికలో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని ... ప్రభుత్వ వాహనాలను కూడా ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు ధర్మేంద్ర ప్రదాన్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?