హైద్రాబాద్ మియాపూర్ లో పరస్పరం దాడికి దిగిన యువకులు:తీవ్ర గాయాలతో ఆసుపత్రికి

Published : Oct 25, 2022, 11:23 AM IST
హైద్రాబాద్ మియాపూర్ లో పరస్పరం దాడికి  దిగిన యువకులు:తీవ్ర గాయాలతో  ఆసుపత్రికి

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని మియాపూర్ లో ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఇద్దరు యువకులు కత్తి,కర్రలతో దాడి  చేసుకున్నారు.ఈ దాడికి కారణాలు తెలియాల్సి  ఉంది.

హైదరాబాద్:నగరంలోని  మియాపూర్  లో  ఇద్దరు యువకులు మంగళవారంనాడు  రోడ్డుపై పరస్పరం దాడి  చేసుకున్నారు.  తీవ్రంగా గాయపడి ఇద్దరు రోడ్డుపై కుప్పకూలిపోయారు.  దీంతో స్థానికులు వారిని  ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై ఇష్టమొచ్చినట్టుగా  ఇద్దరు  యువకులు  కొట్టుకుంటూ  హల్ చల్ చేశారు.  ఒకరు కత్తితో  మరొకరిపై దాడి  చేశారు.  మరో వ్యక్తి  కర్రతో  దాడికి దిగాడు. ఈ  ఘర్షణలో ఇద్దరు  వ్యక్తులు  తీవ్రంగా గాయపడ్డారు. పరస్పరం దాడులకు దిగిన  ఇద్దరు  వ్యక్తులు  తీవ్ర గాయాలతో  రోడ్డుపైనే  కుప్పకూలిపోయారు గాయపడిన వారిలో ఒకరిని అంబులెన్స్ లో మరొకరిని  ఆటోలో ఆసుపత్రికి  తరలించారు. ఇరువురు యువకులు పరస్పరం  దాడి చేసుకోవడానికి గల కారణాలు  తెలియాల్సి  ఉంది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే