తెలంగాణలో పెరిగిన చలి.. ఇద్దరు మృతి

Published : Jan 04, 2019, 09:39 AM IST
తెలంగాణలో పెరిగిన చలి.. ఇద్దరు మృతి

సారాంశం

తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది.  ఈ చలితీవ్రత ను తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు కన్నుమూశారు. 


తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకీ పెరిగిపోతోంది.  ఈ చలితీవ్రత ను తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు కన్నుమూశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో చలి తీవ్రతకు ఇద్దరు వృద్ధులు మృత్యువాత పడ్డారు. 

భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం అమెర్థా ఎస్ సి కాలనీకి చెందిన యాస రాజేంద్రం(65) అనారోగ్యంతో బాధపడుతుండగా చలి తీవ్రత ఎక్కువ కావటంతో మృతి చెందాడు. అలాగే ఖమ్మం జిల్లా వైరా మండలం అష్ణగుర్తి గ్రామానికి చెందిన మస్తానమ్మ (85)  చలి తీవ్రతను తట్టుకోలేక ప్రాణాలు విడిచింది.

PREV
click me!

Recommended Stories

Hidden Waterfall: బొగత కంటే క్రేజీ స్పాట్.. అడవిలో దాగున్న అద్భుత జలపాతం.. అడ్వెంచర్ లవర్స్‌కు పూనకాలే !
బాలామృతం సభలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | Asianet News Telugu