జీడిమెట్ల ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి, రంగంలోకి అగ్నిమాపక శాఖ

Siva Kodati |  
Published : Mar 01, 2023, 02:24 PM IST
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్.. ఇద్దరు మృతి, రంగంలోకి అగ్నిమాపక శాఖ

సారాంశం

జీడిమెట్లలోని ఫార్మా కంపెనీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.

హైదరాబాద్‌ను వరుస అగ్నిప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా జీడిమెట్లలోని ఫార్మా కంపెనీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

నల్గొండ గద్దర్ పాట ఎలివేషన్స్ తో... Revanth Public Meeting at Nakrekal
Vegetable Prices : నిమ్మ ధర వింటే వామ్మో అనాల్సిందే... హైదరాబాద్ లో ఏ కూరగాయ ధర ఎంత?