రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు గ్రామాల యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం..

Published : Jan 16, 2023, 10:46 AM IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు గ్రామాల యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి పరిస్థితి విషమం..

సారాంశం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు చెందినవారు విచక్షణరహితంగా దాడులు చేసుకున్నారు.  

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు చెందినవారు విచక్షణరహితంగా దాడులు చేసుకున్నారు.  ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వివరాలు.. భూవివాదం నేపథ్యంలో అంకుషాపూర్, రామన్నపల్లెకు చెందిన ఇరువర్గాల యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రామన్నపల్లెకు చెందిన ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో రాజు అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. 

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్