ఇంట్లో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. యువకుడికి దేహశుద్ధి..

By SumaBala BukkaFirst Published Jan 26, 2023, 8:10 AM IST
Highlights

ఇంట్లో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు ఆ యువకుడిని కరెంట్ స్తంభానికి కట్టేసి, దేహశుద్ధి చేశారు. 

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు  దారుణానికి పాల్పడ్డాడు. రెండున్నరేళ్ల చిన్నారిని  ఆడించడానికి వచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిపై అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. ఈ హేయమైన ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని ఓ తండాలో జరిగింది. వ్యవసాయ పనులకు వెళ్లే పాప తల్లిదండ్రులు రోజులాగే ఆరోజు కూడా వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఈ దారుణం జరిగింది.

తల్లిదండ్రులు పనులకు వెళ్ళినప్పుడు చిన్నారిని బామ్మ చూసుకుంటుంది. ఆరోజు కూడా అలాగే తల్లిదండ్రులు చిన్నారిని బామ్మ దగ్గర వదిలేసి పనులకు వెళ్లారు.  బామ్మ ఇంటి బయట పనులు చేసుకుంటుంది. చిన్నారి ఇంట్లో ఆడుకుంటుంది. ఈ సమయంలో అదే తండాకు చెందిన అశోక్ (32) అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. పాపతో ఆడుకోవడానికి వచ్చాడని అనుకున్న బామ్మ  తన పనుల్లో తానుంది.

ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. అరిచిందని, మంచంకోడుకు కొట్టి హత్య.. కామాంధుడికి ఉరిశిక్ష..

దీంతో ఎవరూ చూడడం లేదని భావించిన ఆ యువకుడు చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో భయానికి గురైన చిన్నారి గట్టిగా ఏడుస్తూ ఉండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన నిందితుడైన యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ వారంతా కలిసి యువకుడిని పట్టుకుని  కరెంటు స్తంభానికి కట్టేశారు. దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని యువకుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. 

అత్యాచారానికి గురైన చిన్నారిని వైద్య పరీక్షల కోసం మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి పంపించారు. గతంలో కూడా యువకుడు ఇలాంటి పనులు చేసిన చరిత్ర ఉంది. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించగా గ్రామస్తులు పట్టుకుని మందలించారు. అయినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రస్తుతం రెండున్నరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. చిన్నారులకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

click me!