టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం.. అతడి కోసం లుక్ అవుట్ సర్క్యులర్!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో కీలక పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు  చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు.

tspsc paper leak case sit look out notice for prashant who is abroad says reports ksm

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరో కీలక పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు  చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఈ కేసులో రాజశేఖర్‌ రెడ్డికి బావ వరుసయ్యే ప్రశాంత్‌ కోసం లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్టుగా సమాచారం. ప్రశాంత్‌ న్యూజిలాండ్‌లో ఉంటుండగా.. అతనికి రాజశేఖర్ ద్వారా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం చేరింది. దీంతో ప్రశాంత్ అక్కడే పేపర్‌లో ప్రశ్నలకు జవాబులు ప్రిపేర్ అయి.. ఇక్కొడికి వచ్చి పరీక్ష రాశాడు. అనంతరం  తిరగి న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌కు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు కూడా వచ్చినట్టుగా కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 

అయితే ఈ విషయం గుర్తించిన సిట్‌ అధికారులు.. వాట్సాప్‌‌, మెయిల్‌‌ ద్వారా ప్రశాంత్‌‌ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే సిట్ అధికారులకు ప్రశాంత్‌‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడి కోసం సిట్ అధికారులు లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేశారు. న్యూజిలాండ్‌ నుంచి ప్రశాంత్ ఇండియాకు తిరిగి వస్తే.. ఇమ్మిగ్రేషన్ అధికారులు సిట్‌ బృందానికి సమాచారం పంపేందుకు గానూ ఈ నోటీసులు జారీచేసినట్టుగా తెలుస్తోంది. 

Latest Videos

vuukle one pixel image
click me!