మా నాన్నకు ప్రాణహాని ఉంది.. వాళ్లు పద్దతి మార్చుకుంటే మంచిది: డీఎస్ కుమారుడు సంజయ్ సంచలనం

By Sumanth KanukulaFirst Published Mar 27, 2023, 5:13 PM IST
Highlights

సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్‌) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. డీఎస్ నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఈ రోజు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటన  వెలువడింది. ఈ పరిణామాలపై డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ స్పందించారు.

సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(డీఎస్‌) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. డీఎస్ నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఈ రోజు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటన  వెలువడింది. ఈ పరిణామాలపై డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ స్పందించారు. తన తండ్రికి ప్రాణ హాని ఉందని సంచలన కామెంట్స్ చేశారు. తన తండ్రికి ఫిట్స్ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారని.. ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. అరవింద్‌కు కొందరు సహకరిస్తున్నారని.. వాళ్లు ఎవరో తెలుసునని అన్నారు. వాళ్లు పద్దతి మార్చుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు. అరవింద్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. 

అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారన మండిపడ్డారు. రాజీనామా లేఖలు బీజేపీ ఎంపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని విమర్శించారు. పార్టీ ఆదేశిస్తే అరవింద్‌పై పోటీ చేస్తానని అన్నారు. అరవింద్ తన తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. ఇక, తాను రెండేళ్లుగా కాంగ్రెస్‌లో చేరడానికి ఎదురు చూశానని చెప్పారు. తాను కాంగ్రెస్‌లో చేరడానికి సంబంధించి మహేష్ గౌడ్‌కు సమాచారం ఉందో లేదో తనకు తెలియదని అన్నారు. 

అయితే డీఎస్‌ ఇద్దరు కొడుకుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. డీఎస్, ఆయన పెద్ద కుమారుడు సంజయ్‌.. ఆదివారం కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి  తెలిసిందే. అయితే ఈ పరిణామాలు ప్రస్తుతం బీజేపీలో ఉన్న డీఎస్ చిన్న కుమారుడు అరవింద్‌కు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉండటంతో.. కుటుంబంలో నెలకొన్న రాజకీయ ఘర్షణ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మరుసటి రోజే డీఎస్‌ నుంచి రాజీనామా ప్రకటన వెలువడినట్టుగా తెలుస్తోంది. 

ఇక, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు డీఎస్ రాజీనామా లేఖను పంపారు. డీఎస్ రాజీనామా లేఖను ఆయన  భార్య ధర్మపురి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. ఆ వీడియోలో డీఎస్ రాజీనామా లేఖపై సంతకం చేస్తున్నట్టుగా కూడా చూపెట్టారు. కాంగ్రెస్ వాళ్లు, మీడియా వాళ్లు తమ ఇంటికి రావొద్దని విజయలక్ష్మి కోరారు. రాజీనామ లేఖను కూడా చూపించారు. డీఎస్‌కు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. 

Also Read: డీఎస్‌ కుటుంబంలో చేరికల చిచ్చు.. కాంగ్రెస్‌లో చేరిన మరుసటి రోజే పార్టీకి రాజీనామా..

ధర్మపురి విజయలక్ష్మి పేరుతో విడుదలై లేఖలో.. ‘‘ఇగో డిఎస్ గారి రాజీనామా ! ఇది రాజకీయాలు చేసే సమయం కాదు ! ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్దతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి.. మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది. కాంగ్రెస్ వాళ్లకి చేతులు జోడించి దండం పెడుతున్న! ఇంకోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి’’ అని పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్‌లో చేరిన మరసుటి రోజే డీఎస్.. ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే ఆయన కుటుంబంలో నెలకొన్న రాజకీయ ఘర్షణే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. 8 ఏళ్ల కిందట కాంగ్రెస్‌ను వీడిన డీఎస్.. బీఆర్ఎస్‌లో చేరారు. కొంతకాలానికి ఆ పార్టీకి దూరమయ్యారు. మరోవైపు డీఎస్ ఇద్దరు కుమారులలో.. ఒకరైన ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే నిన్న మరో కుమారుడు ధర్మపురి సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరారు. సంజయ్‌తో పాటు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ వీల్‌ ఛైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చిన డీఎస్.. అక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 
 

click me!