గ్రూప్-1 నోటిఫికేషన్: రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ

Published : Feb 19, 2024, 04:43 PM ISTUpdated : Feb 19, 2024, 05:14 PM IST
 గ్రూప్-1 నోటిఫికేషన్: రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ

సారాంశం

 గ్రూప్-1 నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్‌సీ  రద్దు చేసింది.  2022లో  గ్రూప్-1 పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ జారీ చేసింది.


హైదరాబాద్: గ్రూప్-1 నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ ) రద్దు చేసింది.2022 ఏప్రిల్ లో 503 పోస్టులను  గ్రూప్-1 పరిధిలో భర్తీ చేయాలని  నోటిఫికేషన్ ను జారీ చేశారు.ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం నాడు రద్దు చేసింది. ఈ నెల 6వ తేదీన  గ్రూప్-1లో మరో 60 పోస్టులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  2022 ఏప్రిల్ మాసంలో  రాష్ట్రంలో  503 పోస్టులను భర్తీ చేయాలని  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం

ఈ నోటిఫికేషన్ ప్రకారంగా  2023 అక్టోబర్  16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. అయితే పేపర్ లీకేజీ కారణంగా  ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.  మరో వైపు మరోసారి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. అయితే  ఈ పరీక్ష విషయంలో కొందరు అభ్యర్థులు  హైకోర్టును ఆశ్రయించారు.  పరీక్ష నిర్వహణకు సంబంధించి నిబంధనలు పాటించలేదని  అభ్యర్థులు  కోర్టును ఆశ్రయించారు.ఈ విషయమై ఇరు వర్గాల  వాదనలు విన్న తర్వాత రెండో దఫా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని  హైకోర్టు ఆదేశించింది. 

also read:ఢిల్లీకి రేవంత్ రెడ్డి: కేబినెట్ విస్తరణ, నామినేటేడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చలు

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో  టీఎస్‌పీఎస్‌సీ  సవాల్ చేసింది. అయితే అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో  ఎన్నికలు జరిగాయి.  ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. భారత రాష్ట్ర సమితి స్థానంలో  కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అయితే  సుప్రీంకోర్టులో పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీంతో  సుప్రీంకోర్టులో పిటిషన్ ను  టీఎస్‌పీఎస్‌సీ వెనక్కు తీసుకుంది.   దరిమిలా ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసింది.  తాజాగా  ప్రభుత్వం ప్రకటించిన 60 పోస్టులతో కలిపి  563 పోస్టులతో గ్రూప్-1 పోస్టుల భర్తీకి  టీఎస్‌పీఎస్‌సీ  ప్రెష్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. 

గతంలో  టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పరీక్షల పేపర్లు లీకయ్యాయి.దీంతో  యూపీఎస్‌సీ తరహాలో టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.ఈ మేరకు అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. ఈ కమిటీ  ప్రభుత్వానికి నివేదికను కూడ సమర్పించింది. యూపీఎస్‌సీ చైర్మెన్ తో  రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ  భేటీ అయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమించారు.

 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu