గ్రూప్ 4 నోటిఫికేషన్ : అప్లయ్ చేసేటప్పుడు తప్పు చేశారా.. అభ్యర్ధులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్

Siva Kodati |  
Published : May 06, 2023, 06:32 PM ISTUpdated : May 06, 2023, 06:34 PM IST
గ్రూప్ 4 నోటిఫికేషన్  : అప్లయ్ చేసేటప్పుడు తప్పు చేశారా.. అభ్యర్ధులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్

సారాంశం

గ్రూప్ 4 అభ్యర్ధులకు శుభవార్త చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్. అభ్యర్ధులు తమ అప్లికేషన్‌లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మే 9 నుంచి 15 వరకు అభ్యర్ధులు తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చని సూచించింది.

గ్రూప్ 4 అభ్యర్ధులకు శుభవార్త చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్. అభ్యర్ధులు తమ అప్లికేషన్‌లను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొద్దిరోజుల క్రితం 8,039 గ్రూప్ 4 పోస్ట్‌ల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి అభ్యర్ధుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 9 లక్షల మంది గ్రూప్ 4 పోస్ట్‌లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ సమయంలో చాలా మంది తప్పులు చేశారు.

కానీ ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ కొట్టిన తర్వాత ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తమకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలంటూ అభ్యర్ధులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన టీఎస్‌పీఎస్సీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చేందుకు అంగీకరించింది. మే 9 నుంచి 15 వరకు అభ్యర్ధులు తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చని సూచించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి ఎక్కడి వరకంటే.?
TSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. మార్చి 1 నుంచి త‌గ్గ‌నున్న బ‌స్సు ఛార్జీలు. డీపోల‌కు స‌ర్క్యూల‌ర్ జారీ