ఫలితాల విడుదలపై అనుమానాలు: రీకౌంటింగ్‌కు టీఆర్ఎస్ పట్టు

Siva Kodati |  
Published : Dec 04, 2020, 06:34 PM IST
ఫలితాల విడుదలపై అనుమానాలు: రీకౌంటింగ్‌కు టీఆర్ఎస్ పట్టు

సారాంశం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా రాంగోపాల్ పేట, జంగంమెట్, బీఎణ్ రెడ్డి, మూసాపేట డివిజన్ల ఫలితాల ప్రకటనలో వివాదం చోటు చేసుకుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా రాంగోపాల్ పేట, జంగంమెట్, బీఎణ్ రెడ్డి, మూసాపేట డివిజన్ల ఫలితాల ప్రకటనలో వివాదం చోటు చేసుకుంది.

ఇక్కడ తమకు అనుమానాలు వున్నాయని ఆయా పార్టీలు రీకౌంటింగ్‌కు పట్టుబడుతున్నాయి. మరోవైపు చివరి రౌండ్లలో అనూహ్యంగా బీజేపీ ముందుకొచ్చింది.

ఇప్పటి వరకు 51 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించగా... 41 డివిజన్లలో ఎంఐఎం, 2 డివిజన్‌లలో కాంగ్రెస్ గెలుపొందాయి. అయితే 15 డివిజన్‌లలో ఫలితం తేలాల్సి వుంది.

2016తో పోలిస్తే బీజేపీ బలం గణనీయంగా పెరిగింది. అటు బీఎన్ రెడ్డి నగర్‌లో ఫలితాల ప్రకటనలో వివాదం చోటు చేసుకుంది. ఫలితాల ప్రకటనను టీఆర్ఎస్ ఏజెంట్లు అడ్డుకోవడంతో కలకలం రేగింది. ఇకపోతే ఎంఐఎం పట్టున్న జాంబాగ్‌ను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్