పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించాలని టీఆర్‌ఎస్ ఎంపీల నిర్ణయం.. నేడు హైదరాబాద్‌కు..!

By team teluguFirst Published Dec 7, 2021, 9:26 AM IST
Highlights

పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter session) ప్రారంభమైన తొలి రోజు నుంచే ధాన్యం సేకరణపై (paddy procurement) కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలు (TRS MPs) ఉభయ సభల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్లమెంట్ సమావేశాలను బహిర్కించాలని ఎంపీలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter session) ప్రారంభమైన తొలి రోజు నుంచే ధాన్యం సేకరణపై (paddy procurement) కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎంపీలు (TRS MPs) ఉభయ సభల్లో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ ఎంపీలు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల బహిష్కరణకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కూడా పార్లమెంట్ ఉభయసభల్లో ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరికి నిరసనగా టీఆర్‌ఎంపీ ఎంపీ నిరసన చేపట్టనున్నారు. పార్లమెంట్ సమావేశాల బహిష్కరణ ప్రకటన తర్వాత.. టీఆర్‌ఎస్ ఎంపీలు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడే చాన్స్ ఉంది. అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు(Hyderabad) బయలుదేరనున్నారు. 

వరి కొనుగోలుకు సంబంధించి గత కొంతకాలంగా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్దమయ్యారు. ఇందిరా పార్క్‌లో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహిచిన ధర్నాలో కూడా కేసీఆర్ పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రెస్‌మీట్లలో కూడా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

Also Read: TRS MPs walk out: పార్లమెంట్ ఉభయ సభల నుంచి టీఆర్‌ఎస్ ఎంపీల వాకౌట్..

అంతేకాకుండా ఈ అంశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యుహాలపై టీఆర్‌ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కలిసివచ్చే పార్టీలతో కలిసి పోరాడాలని సూచించారు. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల నిరసన గళం వినిపిస్తున్నారు. సమగ్ర జాతీయ ధాన్య సేకరణ విధానం తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంఎస్‌పీ అమలుపై చర్చకు పట్టుబడుతున్నారు. అయితే ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనపై టీఆర్‌ఎస్ ఎంపీలు సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలోనే కేంద్రం వైఖరికి నిరసనగా భవిష్యత్తు కార్యచరణ, కార్యక్రమాలను ప్లాన్ చేసేందుకు సీఎం కేసీఆర్ .. టీఆర్‌ఎస్ ఎంపీలను హైదరాబాద్‌కు తిరిగి రమ్మని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. 
 

click me!