టీఆర్ఎస్‌ను ఆగం పట్టించాలని.. కావాలనే పంచాయతీలు : కేంద్ర మంత్రులపై కవిత ఆగ్రహం

Siva Kodati |  
Published : Sep 07, 2022, 02:22 PM IST
టీఆర్ఎస్‌ను ఆగం పట్టించాలని.. కావాలనే పంచాయతీలు : కేంద్ర మంత్రులపై కవిత ఆగ్రహం

సారాంశం

టీఆర్ఎస్ సర్కార్‌ను ఆగం పట్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రేషన్ షాపు ముందు మోడీ ఫోటో లేదని కలెక్టర్‌తో నిర్మలా సీతారామన్ పంచాయితీ పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు

కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి పంచాయితీ పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ను ఆగం పట్టించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. రేషన్ షాపు ముందు మోడీ ఫోటో లేదని కలెక్టర్‌తో నిర్మలా సీతారామన్ పంచాయితీ పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎప్పుడైనా రేషన్ షాపు ముందు ప్రధాని ఫోటోలు పెట్టారా అని కవిత ప్రశ్నించారు. పెట్రోల్ బంకుల్లో , గ్యాస్ సిలిండర్లపై మోడీ ఫోటోలు పెట్టాలంటూ ఆమె సెటైర్లు వేశారు. 

ఇకపోతే.. కేంద్రం నిధులు వాడుకున్నప్పుడు పేరు ఎందుకు వేయడం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ సర్కార్‌ని నిలదీశారు. తెలంగాణలో 55 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ప్రాజెక్ట్‌కు హైదరాబాద్ ఎంపీ ఫోటో పెడతారా అని నిర్మలమ్మ ప్రశ్నించారు. రాజీనామా సవాళ్లను ప్రజలు గమనిస్తున్నారని.. ఆయుష్మాన్ భారత్‌లో 2021 వరకు తెలంగాణ ఎందుకు చేరలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిలదీశారు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలంటూ హరీశ్‌రావుకు నిర్మలా సీతారామన్ చురకలు వేశారు. 

ALso Read:తెలంగాణలో మీ రాజకీయం నడవదు.. కుట్రలు ఆపితే బెటర్ : బీజేపీకి హరీశ్‌రావు చురకలు

ఫైనాన్స్ కమీషన్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తూనే వున్నామని.. ఈ రాష్ట్రానికి ఎక్కువ, ఆ రాష్ట్రానికి తక్కువ ఇవ్వడం అనేది ఎవరి చేతుల్లోనూ వుండదని ఆమె స్పష్టం చేశారు. సెస్‌ల పేరుతో వసూలు చేసే నిధులు కూడా రాష్ట్రాలకే వెళ్తాయని.. ఏ కారణంతో సెస్ వసూలు చేశారో, వాటి కోసమే ఆ నిధులు ఖర్చు చేయాలని నిర్మలా సీతారామన్ సూచించారు. 

అంతకుముందు హరీశ్ రావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపు దగ్గర ప్రధాని ఫోటో పెట్టాలని అంటున్నారని.. బియ్యం అంతా వాళ్లే ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని హరీశ్ ఫైరయ్యారు. ఇంత దిగజారేలా మాట్లాడొద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని.. తెలంగాణ నిధులే కేంద్రానికి వెళ్తున్నాయని హరీశ్ రావు చెప్పారు. 

కేంద్రంలో ముందుగా మా కేసీఆర్ ఫోటో పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు. నోరు విప్పితే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని.. అబద్ధాలు చెప్పి నిజాలు దాచే ప్రయత్నాలు చేస్తున్నారని హరీశ్ రావు చురకలు వేశారు. పేదలకు 10 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఏటా రూ.3,610 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రానికి రూ.1.7 లక్షల కోట్లు అదనంగా ఇచ్చామని.. మీరు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని , మేం వాస్తవాలు మాట్లాడుతున్నామని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పారలేదని అమిత్ షా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave: వ‌చ్చే 4 రోజులు చుక్క‌లే.. గ‌జ‌గ‌జ వ‌ణకాల్సిందే. ఎల్లో అల‌ర్ట్
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?