షాకింగ్ న్యూస్.. టీఆర్ఎస్ కీలక నేత మృతి

Published : Oct 23, 2018, 01:57 PM IST
షాకింగ్ న్యూస్.. టీఆర్ఎస్ కీలక నేత మృతి

సారాంశం

రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ కీలక నేత మృతి చెందిన సంఘటన కీసర మండలంలో చోటుచేసుకుంది. 

రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ కీలక నేత మృతి చెందిన సంఘటన కీసర మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన మండల మాజీ వైస్‌-ఎంపీపీ బి.భరత్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే..  మార్నింగ్‌ వాక్‌ చేయడానికి బైక్‌పై వెళ్తున్న భరత్‌రెడ్డిని గుర్తు తెలియని లారీ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కలవారు ఆయనను జినియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భరత్‌రెడ్డి మృతిచెందినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాద దృశ్యాలు ఓ సీసీటీవీలో నమోదయ్యాయి. కాగా, భరత్‌రెడ్డి మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu