సికింద్రాబాద్‌ సీటీవో వద్ద ట్రాఫిక్ ఆంక్షలు .. జూన్ 4 వరకు అమలు, ఏ దారిలో వెళ్లాలంటే...?

Siva Kodati |  
Published : Apr 20, 2022, 03:26 PM IST
సికింద్రాబాద్‌ సీటీవో వద్ద ట్రాఫిక్ ఆంక్షలు .. జూన్ 4 వరకు అమలు, ఏ దారిలో వెళ్లాలంటే...?

సారాంశం

రసూల్‌పురా నాలా మరమ్మత్తుల కారణంగా రేపటి నుంచి జూన్ 4 వరకు సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వాహనదారులకు  ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు  తెలిపారు. 

సికింద్రాబాద్ (secunderabad) సీటీవో జంక్షన్ (cto junction) నుంచి రసూల్‌పురా (rasulpura) వరకు ట్రాఫిక్ ఆంక్షలు (traffic restrictions) విధించారు పోలీసులు. రేపటి నుంచి జూన్ 4వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు. రసూల్‌పురా నాలా మరమ్మత్తుల కారణంగా ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు. సీటీవో నుంచి వచ్చే వాహనాలను హనుమాన్ దేవాలయం మీదుగా మళ్లించనున్నారు. బేగంపేట నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పురా నుంచి కిమ్స్ వైపుగా మళ్లించనున్నారు. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా వాహనదారులు  సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?