హైద్రాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగుల ధర్నా: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

Published : Mar 24, 2023, 03:04 PM ISTUpdated : Mar 24, 2023, 03:11 PM IST
హైద్రాబాద్ విద్యుత్ సౌధ వద్ద  ఉద్యోగుల  ధర్నా: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

సారాంశం

హైద్రాబాద్ నగరంలోని  సోమాజీగూడ  విద్యుత్ సౌధ వద్ద  ఉద్యోగుల  ఆందోళనతో  ట్రాఫక్ జాం నెలకొంది. 

హైదరాబాద్: నగరంలోని  సోమాజీగూడ  విద్యుత్  సౌధ వద్ద  టీఎస్‌పీఈజేఏసీ ఉద్యోగులు  శుక్రవారంనాడు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో  ట్రాఫిక్ కు  తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేతన సవరణ, ఆర్జిజెన్ కార్మికుల సమస్యలపై మహా ధర్నా నిర్వహించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా  పలు  జిల్లాల నుండి  పెద్ద ఎత్తున కార్మికులు  విద్యుత్ సౌధ  వద్దకు వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. దీంతో  ఖైరతాబాద్-పంజాగుట్ట మార్గంలో  భారీ ఎత్తున  వాహనాలు నిలిచిపోయాయి. సుమారు  రెండు కిలోమీటర్ల  పాటు   వాహనాలు  రోడ్డుపైనే  నిలిచిపోయాయి.

పీఆర్‌సీతో  పాటు  29 డిమాండ్లను పరిష్కరించాలని  జేఏసీ నేతలు డిమాండ్  చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల  ఆందోళనల  నేపథ్యంలో   ఈ మార్గంలో  రోడ్లపైనే  వాహనాలు నిలిచిపోయాయి.   విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున రావడంతో  వారిని  నిలువరించడం పోలీసులకు  కష్టంగా  మారింది.  ఒక దశలో ఉద్రిక్తత నెలకొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే