తెలంగాణ కరోనా అప్ డేట్: గుడ్ న్యూస్... ఆ జిల్లాల్లో జీరో కరోనా కేసులు

By Arun Kumar PFirst Published Dec 7, 2020, 9:14 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్రం మెల్లిమెల్లిగా కరోనా కోరల్లోంచి బయటపడుతోంది.  

హైదరాబాద్: తెలంగాణ మెల్లిమెల్లిగా కరోనా కోరల్లోంచి బయటపడుతోంది. ఈ మధ్యకాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య అతి తక్కువగా రికవరీల సంఖ్య అధికంగా వుండటంతో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 7778 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

రాష్ట్రంలో ఇటీవల టెస్టుల సంఖ్య పెరిగినా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గత 24గంటల్లో(సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 33,098మందికి టెస్టులు చేయగా కేవలం 517 పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 58,12,588  చేరగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,858కి చేరింది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 862 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,64,606కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో కేవలం ఇద్దరు మాత్రమే మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1474కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 94.4శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.62శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే కామారెడ్డి, నారాయణ పేటలో కేసులేవి నమోదుకాలేదు. అలాగే జోగులాంబ గద్వాల 1, అసిఫాబాద్ 2, నిర్మల్ 2, వనపర్తి 3 అతి తక్కువ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 102కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ 36, రంగారెడ్డి 57, భద్రాద్రి కొత్తగూడెం 26, కరీంనగర్ 33, ఖమ్మం 16,  సంగారెడ్డి 21, సూర్యాపేట 7, వరంగల్ అర్బన్ 7, నల్గొండ 15, మంచిర్యాల 15, జగిత్యాల19, సిరిసిల్ల 5 నిజామాబాద్ 10, ములుగు 7, సిద్దిపేట 11 కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 

Media Bulletin on status of positive cases in Telangana. (Dated. 06.12.2020) pic.twitter.com/CUgdI5yf8U

— Dr G Srinivasa Rao (@drgsrao)

 


 


 

click me!