Hanuman Jayanthi: కట్టుదిట్టమైన భద్రత మధ్య హనుమాన్ జయంతి ఉత్సవాలు.. !

Published : Apr 14, 2022, 10:58 AM IST
Hanuman Jayanthi: కట్టుదిట్టమైన భద్రత మధ్య హనుమాన్ జయంతి ఉత్సవాలు..  !

సారాంశం

Telangana: రాబోయే చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జ‌యంతిని జ‌రుపుకోవ‌డానికి భ‌క్తులంద‌రూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం  హైద‌రాబాద్ నగరంలో నిర్వహించనున్న శోభాయాత్రకు నగర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Hanuman Jayanthi procession : హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని శనివారం హైద‌రాబాద్ నగరంలో నిర్వహించనున్న శోభాయాత్రకు నగర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ‌లోని చాలా ప్రాంతాల్లో హ‌నుమాన్ జ‌యంతిని ఘ‌నంగా జ‌రుపుకుంటారు. హ‌నుమంతుని ఊరేగింపు శోభాయ‌మానంగా ఉంటుంది. పెద్ద ఎత్తున భ‌క్తులు ఇందులో పాల్గొంటారు. ఈ క్ర‌మంలోనే పోలీసులు భ‌ద్ర‌త చ‌ర్య‌ల‌ను క‌ట్టుదిట్టం చేస్తున్నారు. న‌గ‌రంలో జ‌రిగే హ‌నుమంతును శోభ‌యాత్ర‌లో ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. 

భక్తుల రద్దీ అధికంగా ఉంటే అవ‌కాశాలున్న నేప‌థ్యంలో హ‌నుమాన్ శోభ‌యాత్ర కోసం పోలీసులు విస్తృతమైన భద్రతా ప్రణాళికను రూపొందించారు. శాంతిభద్రతలు, భద్రతా ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని, ఇతర ప్రభుత్వ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎస్‌హెచ్‌ఓలందరికీ మార్గదర్శకాలు ఇప్పిటికే జారీ చేయబ‌డ్డాయి. పోలీసులు ఎప్పటిక‌ప్పుడు శోభ‌యాత్ర‌ను ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. శోభాయాత్ర సజావుగా ముగియడానికి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన బుధవారం అంతర్‌శాఖల సమన్వయ సమావేశం జరిగింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ), ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌, అగ్నిమాపక శాఖ, ఈఎంఆర్‌ఐ, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌లకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా నిర్వ‌హించే ఊరేగింపు మార్గంలో పటిష్టమైన బారికేడింగ్‌లు, నిరంతర విద్యుత్ సరఫరా, చెత్తను తొలగించడం మరియు చెట్ల కొమ్మలను కత్తిరించడం వంటి వాటి ఆవశ్యకతపై ఆనంద్ ఇతర ప్రభుత్వ శాఖలకు వివరించారు. రోడ్డు రవాణా సంస్థ (RTC) విభాగం మెకానిక్‌లు మరియు డ్రైవర్‌లను డిప్యూట్ చేసే పనిని కలిగి ఉంది. ప్రధాన ఊరేగింపు మార్గంలో EMRI అధికారులు అంబులెన్స్‌లను ఉంచుతారు. శోభ‌యాత్ర జ‌రిగే రోజున జాయింట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సీనియర్ అధికారులను డిప్యూట్ చేయాలని న‌గ‌ర క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ హాజరైన వారికి ఉద్ఘాటించారు. కాగా, ఒక వారం కంటే తక్కువ సమయంలో నగరంలో జరిగే రెండవ ప్రధాన మతపరమైన ఊరేగింపు ఇది కావ‌డం గ‌మ‌నార్హం. రామ నవమి శోభాయాత్ర ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత నిర్వహించిన ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భారీ భద్రతా ఏర్పాట్లలో భాగంగా 7 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు.

హనుమాన్ జయంతి ఊరేగింపు గౌలిగూడ రామమందిరం నుండి బయలుదేరి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వద్ద ముగుస్తుంది. దాదాపు 12 కి.మీ. హ‌నుమంతుని శోభ‌యాత్ర కొన‌సాగ‌నుంది. కాగా, రామ నవమి సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగాయి.రామ నవమి ఊరేగింపుల సందర్భంగా హింసాత్మక సంఘటనల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. దీనికి తోడు వరుసగా వివిధ మతాలకు చెందిన వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో మత ఘర్షణలు చోటుచేసుకునే అవకాశమున్నందున పోలీసులు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా  దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా భ‌ద్ర‌త‌ను పెంచారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్