హైద్రాబాద్ దోమలగూడ గ్యాస్ సిలిండర్ పేలుడు: చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి

Published : Jul 14, 2023, 11:53 AM ISTUpdated : Jul 14, 2023, 12:01 PM IST
హైద్రాబాద్ దోమలగూడ గ్యాస్ సిలిండర్ పేలుడు: చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి

సారాంశం

హైద్రాబాద్ దోమలగూడ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఇవాళ మరో ముగ్గురు మృతి చెందారు.  ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది.

హైదరాబాద్:  నగరంలోని దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో శుక్రవారంనాడు  మరో ముగ్గురు మృతి చెందారు.  దీంతో  ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో  మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ నెల  12వ తేదీన చిన్నారి శరణ్య మృతి చెందింది.  ఇవాళ  నాగమణి, ధనలక్ష్మి, అభి మృతి చెందారు.   ఈ ప్రమాదంలో  గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

అగ్ని ప్రమాదానికి  గ్యాస్ లీక్ కావడమే కారణంగా అధికారులు  గుర్తించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ను  డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కు ఉపయోగించడంతో ఈ ప్రమాదం జరిగిందని  అధికారులు తెలిపారు.

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tirupati: రూ. 1000 లోపే హైదరాబాద్ టు తిరుపతి టూర్‌ ప్లాన్.. అవును ఇలా చేస్తే సాధ్య‌మే
Weather Update: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. మరోవైపు సూపర్ ఎల్‌నినో, వడదెబ్బల ముప్పు !