కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది: కిష‌న్ రెడ్డి

Published : Sep 13, 2023, 09:35 AM IST
కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది:  కిష‌న్ రెడ్డి

సారాంశం

Hyderabad: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించేందుకు బీజేపీకి సహకరించాలని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌ను కోరారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనంతగా బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.   

BJP state president G Kishan Reddy:  భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్), ఆ పార్టీ అధినేత‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్)ను టార్గెట్ చేస్తూ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జీ కిష‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ స్టేడియంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే ఎం.రఘునందన్ రావు తో  కలిసి మంత్రి మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ఇత‌ర పార్టీల నేతలు బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజుల సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజును వారు బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతివ్వొద్దనీ, బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తే ప్రజలు పేదలుగా మారతారనీ, అవినీతి మ‌రింత‌గా పెరుగుతుంద‌ని కిష‌న్ రెడ్డి హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తమ కుటుంబం తప్ప మరెవరినీ బీఆర్ఎస్ అధ్యక్షునిగా చేయనివ్వరు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఏ రాష్ట్రానికైనా ప్రధాని కావాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా అది బీజేపీ పాలనలోనే సాధ్యమని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు ఓటు వేయడం బీఆర్ ఎస్, ఎంఐఎం పార్టీలకు ఓటు వేసినట్లేనని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేసినట్లేనన్నారు. 'మీరు తీసుకునే ఎంపికల గురించి తెలుసుకోండి. ఈసారి మీకు సేవ చేసేందుకు బీజేపీకి అవకాశం ఇవ్వండి' అని కిషన్ కోరారు.

జాతీయస్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఇతర పార్టీలు సహకరిస్తే ఎన్నికల ఖర్చులన్నీ తానే భరిస్తానని కేసీఆర్ చెప్పారన్నారు. ఇతర పార్టీలకు నిధులు ఇవ్వడానికి ఆయనకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?' అని బీజేపీ నేత ప్రశ్నించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల ఊబిలోకి నెట్టిందనీ, ఆ పార్టీ నేతలు అవినీతిలో కూరుకుపోయారనీ, ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ భూములను అమ్మి ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని జీతాలు ఇస్తున్నారన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu