తెలుగు అకాడమీలో స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.గ్విన్ కమిటీ నివేధిక ఆధారంగా 1968 ఆగస్టు 6న కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడం జరింగింది. అప్పటినుండి ఈ అకాడమీ తెలుగు భాషా వ్యాప్తికి, సాహిత్యానికి కృషి చూస్తూ విజయవంతంగా ముందుకువెళుతోంది. నేటికీ మన మాతృభాష ప్రజల చెంతకు చేరుతోందంటే అది తెలుగు అకాడమీ చలవే అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సంస్థ సెంచరీ వైపు అడుగులేస్తోంది.
తెలుగు అకాడమీలో స్వర్ణోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.గ్విన్ కమిటీ నివేధిక ఆధారంగా 1968 ఆగస్టు 6న కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని ఏర్పాటు చేయడం జరింగింది. అప్పటినుండి ఈ అకాడమీ తెలుగు భాషా వ్యాప్తికి, సాహిత్యానికి కృషి చూస్తూ విజయవంతంగా ముందుకువెళుతోంది. నేటికీ మన మాతృభాష ప్రజల చెంతకు చేరుతోందంటే అది తెలుగు అకాడమీ చలవే అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సంస్థ సెంచరీ వైపు అడుగులేస్తోంది.
ఈ సందర్భంగా అకాడమీ అధికారులు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో విశయ నిపుణులు, ప్రముఖులతో ప్రసంగాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సామాజిక శాస్త్రాలు- సమకాలీన సమాజం అన్న అంశంపై ఏర్నాటుతో పారమంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్(టీఎస్ఫిఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలుగు అకాడమీ సేవలను కొనియాడారు. అలాగే సామాజిక శాస్త్రం గురించిన విషయాలను కూడా సభికులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మరికొంత మంది ప్రముఖులు, వక్తలతో పాటు తెలుగు అకాడమీ ఉద్యోగులు పాల్గొన్నారు.