తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కేసీఆర్ కీలక నిర్ణయం, 120 మందికి ప్రమోషన్

Siva Kodati |  
Published : Sep 01, 2021, 07:04 PM IST
తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కేసీఆర్ కీలక నిర్ణయం, 120 మందికి ప్రమోషన్

సారాంశం

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించింది. ఇందుకు సంబంధించిన దస్త్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆమోదముద్ర వేశారు

తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించింది. ఇందుకు సంబంధించిన దస్త్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 120 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించాయి. అలాగే సెక్షన్ ఆఫీసర్లుగా 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ప్రమోషన్లు పొందనున్నారు. దీనితో పాటు 33 మంది సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ సెక్రటరీలుగా  పదోన్నతులు పొందనున్నారు. అలాగే 20 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు డిప్యూటీ సెక్రటరీలుగా ప్రమోషన్లు దక్కనున్నాయి. వీరితో పాటు 8 మంది డిప్యూటీ సెక్రటరీలకు జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతులు రానున్నాయి. అలాగే నలుగురు జాయింట్ సెక్రటరీలు అడిషనల్ సెక్రటరీలుగా ప్రమోషన్ పొందనున్నారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?