
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,061 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజున 1,20,397 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 1061 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,18,837కి కరోనా కేసులు చేరుకొన్నాయి. కరోనాతో రాష్ట్రంలో గత 24 గంటల్లో 11 మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 3618 మంది మరణించారు.
ఒక్క రోజు వ్యవధిలో 1,556 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 5,99,695కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 15,524 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న పరీక్షించిన శాంపిల్స్ కు చెందిన 736 రిపోర్టులు రావాల్సి ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్డౌన్ కారణంగా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ఇవాళ్టికి కోటి డోసులు దాటాయి. వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.