మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై విచారణకు కేసీఆర్ ఆదేశం

Published : Jun 25, 2021, 07:42 PM ISTUpdated : Jun 25, 2021, 07:46 PM IST
మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై విచారణకు కేసీఆర్ ఆదేశం

సారాంశం

దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాకప్‌డెత్ పై విచారణకు ఆదేశించారు  సీఎం.  

హైదరాబాద్:దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ పై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.లాకప్‌డెత్ పై విచారణకు ఆదేశించారు  సీఎం.అడ్డగూడూరులో  కస్టోడియల్ డెత్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం నాడు  సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి సీఎం కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.

also read:మరియమ్మ కొడుకుకు ఉద్యోగం: కేసీఆర్‌తో సీఎల్పీ నేత భట్టి భేటీ

లాకప్‌డెత్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయవద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ఇలాంటి ఘటనలు క్షమించనని సీఎం తేల్చి చెప్పారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ విషయమై నిజనిర్ధారణ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే వారిని ఉద్యోగంలో నుండి తొలగించాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమన్నారు.మరియమ్మ కొడుకు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకొంటుందని  సీఎం హామీ ఇచ్చారు.

మరియమ్మ కుటుంబానికి రూ. రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని సీఎం ఆదేశించారు. ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం ఇవ్వాలని కూడ సీఎం కోరారు. బాధితులను డీజీపీ పరామర్శించి కేసు పూర్వాపరాలు తెలుసుకోవాలన్నారు.ఈ నెల 28న సీఎల్పీ నేత భట్టి తో కలిసి స్థానిక ప్రజా ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని సీఎం ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్