
హైదరాబాద్: Polytechnicక్ Question Pape లీకయ్యాయి. హైద్రాబాద్ లోని స్వాతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పేపర్ లీకైనట్టుగా అధికారులు గుర్తించారు. లీకైన పేపర్ ను whats app ద్వారా విద్యార్ధులకు చేరింది. ఈ నెల 8వ తేదీ నుండి పాలిటెక్నిక్ పరీక్షలు జరుగుతున్నాయి.
పాలిటెక్నిక్ ప్రశ్నపత్రాల లీకేజీ గురించి ఇతర జిల్లాలకు చెందిన పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపల్స్ గుర్తించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారులు పేపర్ లీకేజీపై కేంద్రీకరించారు. రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో గల Swathi ఇనిస్టిట్యూట్ నుండి పేపర్ లీక్ అవుతున్నట్టుగా గుర్తించారు. వెంటనే టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ విషయమై స్వాతి ఇనిస్టిట్యూట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.