టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు ఆర్ఎస్ ప్రవీణ్ దీక్ష: అరెస్ట్ చేసిన పోలీసులు

By narsimha lodeFirst Published Mar 17, 2023, 11:32 AM IST
Highlights


బీఎస్పీ  తెలంగాణ చీఫ్  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్  చేశారు.  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షను రద్దు  చేయాలని  ప్రవీణ్ కుమార్ దీక్షకు దిగాడు.  ఈ దీక్షను  పోలీసులు భగ్నం  చేశారు.  

హైదరాబాద్: బీఎస్పీ  తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను  శుక్రవారంనాడు పోలీసులు అరెస్ట్   చేశారు.  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షను రద్దు  చేయాలని  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  తమ  పార్టీ కార్యాలయంలో  దీక్షకు దిగారు.  ఈ దీక్షను  పోలీసులు భగ్నం  చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు  బీఎస్పీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్  చేశారు.  పోలీసులు  ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్  చేసి వదిలిపెట్టిన తర్వాత  తన నివాసంలో దీక్షను చేస్తున్నట్టుగా  ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 

 

మీరు ఎన్ని అరెస్టులు చేసినా నా పోరాటం ఆగదు. ఖబడ్దార్ కేసీఆర్👊 పేపర్ లీకులకు మీ కుటుంబానికి సంబందం ఉన్నది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో ఉన్నది మీ ఏజెంట్లే. ఇది CBI ఎంక్వైరీ ద్వారానే తెలుస్తుంది. నిజం నిప్పులాంటిది. తెలంగాణ సమాజమంతా గమనించాలి. pic.twitter.com/Yx1owVoNHU

— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero)

 

తెలంగాణ కు నమస్కారం🙏 నిరుద్యోగులకు న్యాయం కావాలని శాంతియుతంగా దీక్ష చేస్తున్న నన్ను,BSP నాయకులను, నిరుద్యోగులను హైదరాబాదు పోలీసులు అరెస్టు చేసిండ్రు. ఇటీవల జరిగిన అన్ని పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి. TSPSC ఛైర్మన్ను బర్తరఫ్ చేసి దీని మీదCBI తో విచారణ జరిపించాలి.

— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero)

ఈ నెల 12. 15.16 తేదీల్లో  జరగాల్సిన  పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది.  ఈ నెల  5వ తేదీన  జరిగిన  ఏఈ  పరీక్షలను రద్దు  చేసింది.  ఈ ప్రశ్నాపత్రం  లీక్  కేసులో  పోలీసులు  ఇప్పటికే  9 మందిని  అరెస్ట్  చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును విచారించేందుకు  ప్రభుత్వం సిట్  ను  ఏర్పాటు  చేసింది. ప్రశ్నాపత్రం లీక్  కేసులో  ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు కీలకంగా వ్యవహరించారని  పోలీసులు చెబుతున్నారు.   ఈ  కేసును టెక్నికల్ ఆధారాలతో  విచారణ  చేయాలని భావిస్తున్నారు. ప్రవీణ్  ఫోన్ ను పోలీసులు ఎఫ్ఎస్ఎల్  కు పంపారు. 


 

click me!