టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు ఆర్ఎస్ ప్రవీణ్ దీక్ష: అరెస్ట్ చేసిన పోలీసులు

Published : Mar 17, 2023, 11:32 AM ISTUpdated : Mar 17, 2023, 03:24 PM IST
 టీఎస్‌పీఎస్‌సీ  గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు  ఆర్ఎస్ ప్రవీణ్ దీక్ష: అరెస్ట్  చేసిన పోలీసులు

సారాంశం

బీఎస్పీ  తెలంగాణ చీఫ్  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్  చేశారు.  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షను రద్దు  చేయాలని  ప్రవీణ్ కుమార్ దీక్షకు దిగాడు.  ఈ దీక్షను  పోలీసులు భగ్నం  చేశారు.  

హైదరాబాద్: బీఎస్పీ  తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను  శుక్రవారంనాడు పోలీసులు అరెస్ట్   చేశారు.  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షను రద్దు  చేయాలని  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  తమ  పార్టీ కార్యాలయంలో  దీక్షకు దిగారు.  ఈ దీక్షను  పోలీసులు భగ్నం  చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు  బీఎస్పీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్  చేశారు.  పోలీసులు  ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్  చేసి వదిలిపెట్టిన తర్వాత  తన నివాసంలో దీక్షను చేస్తున్నట్టుగా  ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. 

 

 

ఈ నెల 12. 15.16 తేదీల్లో  జరగాల్సిన  పరీక్షలను  టీఎస్‌పీఎస్‌సీ వాయిదా వేసింది.  ఈ నెల  5వ తేదీన  జరిగిన  ఏఈ  పరీక్షలను రద్దు  చేసింది.  ఈ ప్రశ్నాపత్రం  లీక్  కేసులో  పోలీసులు  ఇప్పటికే  9 మందిని  అరెస్ట్  చేశారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును విచారించేందుకు  ప్రభుత్వం సిట్  ను  ఏర్పాటు  చేసింది. ప్రశ్నాపత్రం లీక్  కేసులో  ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు కీలకంగా వ్యవహరించారని  పోలీసులు చెబుతున్నారు.   ఈ  కేసును టెక్నికల్ ఆధారాలతో  విచారణ  చేయాలని భావిస్తున్నారు. ప్రవీణ్  ఫోన్ ను పోలీసులు ఎఫ్ఎస్ఎల్  కు పంపారు. 


 

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?