ఆ జీవోల ప్రకారమే నీటి వినియోగం:ఏపీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

Published : Jul 02, 2021, 02:39 PM ISTUpdated : Jul 02, 2021, 04:04 PM IST
ఆ జీవోల ప్రకారమే నీటి వినియోగం:ఏపీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

సారాంశం

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని ఏపీ దోచుకొంటుందన్నారు. నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాని మోడీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు.  కృష్ణా నదిలో 26 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్న ఏపీకి 66 శాతం నీళ్లు పోతున్నాయని ఆయన చెప్పారు.

హైదరాబాద్: అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని ఏపీ దోచుకొంటుందన్నారు. నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాని మోడీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు.  కృష్ణా నదిలో 26 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్న ఏపీకి 66 శాతం నీళ్లు పోతున్నాయని ఆయన చెప్పారు.

also read:జలవివాదం: ఏపీకి తెలంగాణ కౌంటర్, కేఆర్ఎంబీ తీరుపై కూడ అసంతృప్తి

ఏ అనుమతులు లేకుండానే ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని  ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవోల ప్రకారంగానే తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకొంటుందని ఆయన చెప్పారు.విద్యుత్ ప్రాజెక్టులున్న దగ్గర నుండి నీటిని వాడుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.తెలంగాణ ఉద్యమ కాలంలోనూ తాము సెటిలర్స్ అనే పదం వాడలేదన్నారు. ఏపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?