ఆ జీవోల ప్రకారమే నీటి వినియోగం:ఏపీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

Published : Jul 02, 2021, 02:39 PM ISTUpdated : Jul 02, 2021, 04:04 PM IST
ఆ జీవోల ప్రకారమే నీటి వినియోగం:ఏపీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్

సారాంశం

అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని ఏపీ దోచుకొంటుందన్నారు. నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాని మోడీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు.  కృష్ణా నదిలో 26 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్న ఏపీకి 66 శాతం నీళ్లు పోతున్నాయని ఆయన చెప్పారు.

హైదరాబాద్: అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని ఏపీ దోచుకొంటుందన్నారు. నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాని మోడీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు.  కృష్ణా నదిలో 26 శాతం క్యాచ్‌మెంట్ ఏరియా ఉన్న ఏపీకి 66 శాతం నీళ్లు పోతున్నాయని ఆయన చెప్పారు.

also read:జలవివాదం: ఏపీకి తెలంగాణ కౌంటర్, కేఆర్ఎంబీ తీరుపై కూడ అసంతృప్తి

ఏ అనుమతులు లేకుండానే ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని  ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవోల ప్రకారంగానే తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకొంటుందని ఆయన చెప్పారు.విద్యుత్ ప్రాజెక్టులున్న దగ్గర నుండి నీటిని వాడుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.తెలంగాణ ఉద్యమ కాలంలోనూ తాము సెటిలర్స్ అనే పదం వాడలేదన్నారు. ఏపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో సొంతిళ్లు లేద‌ని బాధ‌ప‌డుతున్నారా? ఈ ప్రాంతంలో కొనుగోలు చేస్తే మీ క‌ల తీరిన‌ట్లే
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పలితాలు.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్..?