వెల్‌లోకి వచ్చినందునే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: హరీష్ రావు

Published : Mar 07, 2022, 04:04 PM IST
వెల్‌లోకి వచ్చినందునే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: హరీష్ రావు

సారాంశం

శాసనసభ వెల్‌లోకి వచ్చినందునే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.   

హైదరాబాద్:  Assembly వెల్‌లోకి వచ్చినందునే BJP MLAలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao తెలిపారు.అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత సోమవారం నాడు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మీడియా ప్రతినిధులతో Chit Chat చేశారు. 

శాసనసభ వెల్ లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత BAC లో CM KCR చెప్పారని ఆయన గుర్తు చేశారు. వెల్ లోకి వచ్చినందునే  బీజేపీ ఎమ్మెల్యే లు సస్పెండ్ అయ్యారని మంత్రి హరీష్ రావు చెప్పారు. Congress ఎమ్మెల్యేలు శాసనసభ వెల్ లోకి రాలేదన్నారు. అందుకే వారిని  సస్పెండ్ చేయలేదని ఆయన గుర్తు చేశారు. 

 తమ స్థానం లో నిలబడి అడిగితేనే Rajya Sabha లో  12 మందిని  సస్పెండ్ చేశారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. Delhiకి ఒక న్యాయం రాష్ట్రానికి ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. Suspend అవ్వాలని  కావాలనే బీజేపీ ఎమ్మెల్యేలు వెల్ లోకి వచ్చారని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. గవర్నర్ ప్రసంగం,బడ్జెట్ స్పీచ్ సమయం లో వెల్ లోకి రావొద్దని మంత్రి గుర్తు చేశారు.

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా