ఈ నెల 26న హైద్రాబాద్ లో రైతుల ర్యాలీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్:ఈ నెల 26న హైద్రాబాద్ లో రైతుల ర్యాలీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు అనుమతి ఇచ్చింది. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి మద్దతుగా హైద్రాబాద్ లో రైతులు ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ర్యాలీకి అనుమతి ఇచ్చింది. సరూర్నగర్ స్టేడియం నుండి ఉప్పల్ స్టేఢియం వరకు ర్యాలీ నిర్వహణకు కోర్టు అనుమతి ఇచ్చింది.కరోనా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహించాలని హైకోర్టు సూచించింది. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ర్యాలీని నిర్వహించాలని హైకోర్టు సూచించింది.
ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాచకొండ కమిషనర్ కు ఆదేశించింది.నూతన వ్వవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో నెలన్నర రోజులుగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలకు మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నారు.