వామన్‌రావు దంపతుల హత్య: నివేదిక కోరిన తెలంగాణ హైకోర్టు

Published : Feb 18, 2021, 12:35 PM IST
వామన్‌రావు దంపతుల హత్య: నివేదిక కోరిన తెలంగాణ హైకోర్టు

సారాంశం

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలో న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.పెద్దపల్లిలోని కాల్వచర్లలో ఈ నెల 17న వామన్ రావు దంపతులను దుండగులు దారుణంగా నడిరోడ్డుపై నరికిచంపారు.

also read:వామన్‌రావు దంపతుల హత్య: సుమోటో‌గా తీసుకొన్న తెలంగాణ హైకోర్టు

ఈ హత్యను తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకొంది. ఈ కేసుపై  తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ హత్యలో పాల్గొన్న నిందితులను అరెస్ట్ చేయాలని ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. 

ఈ హత్యపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని హైకోర్టు సూచించింది. హత్యకేసులో నిందితులను వెంటనే పట్టుకోవాలని కోరింది.ఈ కేసుపై విచారణను ఈ ఏడాది మార్చి 1వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

వామన్ రావు కు రక్షణ కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను పోలీసులు అమలు చేయలేదని వామన్ రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఇంకో మూడ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్... తర్వాత వరుస సెలవులే, బ్యాక్ టు బ్యాక్ లాంగ్ వీకెండ్స్
Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్... ఇక్కడ ఒక్క ఎకరం రూ.250 కోట్లా..!