ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్ధుల రక్షణపై కమిటీ ... తొలి భేటికి హాజరైన సబిత

Siva Kodati |  
Published : Nov 26, 2022, 05:24 PM IST
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్ధుల రక్షణపై కమిటీ ... తొలి భేటికి హాజరైన సబిత

సారాంశం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్ధుల భద్రత, రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలి భేటీకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్ధుల భద్రత, రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించేందుకు కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అడిషనల్ డీజీ స్వాతి లక్రాను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

తెలంగాణలో భారీ పెట్టుబడులు అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన | Amazon Data Centre in Telangana
Driving Licence: ట్రాఫిక్ ఫైన్ ప‌డ్డ‌ట్లు ఫోన్‌కి మెసేజ్ రావ‌డం లేదా.? ఇంట్లోనే ఫోన్ నెంబ‌ర్ మార్చేయండి