మలక్‌పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి: రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

Published : Jan 13, 2023, 05:17 PM IST
మలక్‌పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి: రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన  ప్రభుత్వం

సారాంశం

హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  ఇద్దరు బాలింతల మృతికి నిరసనగా  కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు.   మృతుల కుటుంబాలకు  ప్రభుత్వం  రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాను  ప్రకటించింది.  

హైదరాబాద్: నగరంలోని మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందిన  బాలింతల కుటుంబాలకు  రూ. 5 లక్షల చొప్పున  ఆర్ధిక సహాయం అందించడానికి  ప్రభుత్వం  అంగీకరించింది.  రూ. 4 లక్షలను కుటుంబ సంక్షేమ శాఖ  నుండి 
అందించనున్నారు. మిగిలిన లక్ష రూపాయాలను  ఆయా జిల్లాల కలెక్టర్లు అందించనున్నారు. 

also read:మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతిపై విచారణ: హెల్త్ కమిషనర్ అజయ్ కుమార్

మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  డెలీవరీ కోసం  అడ్మిట్  అయిన  ఇద్దరు మహిళలు  మృతి చెందారు.  సిరివెన్నెల, శివానీల అనే ఇద్దరు  మహిళలు  ఈ ఆసుపత్రిలో  సిజేరియన్ పూర్తయ్యాయ  వేర్వేరు కారణాలతో  మృతి చెందారు. ఈ ఇద్దరి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని  మృతుల కుటుంబసభ్యులు  ఆఆరోపించారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరుతూ  ఆసుపత్రి ముందు  ఆందోళనకు దిగారు. ఆందోళనకారులకు  పలు రాజకీయపార్టీలు మద్దతు ప్రకటించాయి.  మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఈ విషయమై  వైద్య ఆరోగ్య శాఖాధికారులతో  మాట్లాడారు.  మృతి చెందిన రెండు కుటుంబాలకు  ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని  ప్రభుత్వం హామీ ఇచ్చింది.  ఈ మేరకు  రాష్ట్రప్రభుత్వ వైద్య శాఖ కమిషనర్ అజయ్ కుమార్  ఈ మేరకు హామీ ఇచ్చారు. ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చిన తర్వాత కూడా ఆసుపత్రి వద్ద  ఆందోళన నిర్వహిస్తున్న  బీఎస్ పీ  సహ పలు పార్టీల శ్రేణులను పోలీసులు  అరెస్ట్  చేశారు

PREV
click me!

Recommended Stories

Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu
Harish Rao Serious Comments on Revanth Reddy | BRS VS CONGRESS | Politics | Asianet News Telugu