టీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఈసీ...ప్రతిపక్షాల ఫిర్యాదుతో నోటీసులు జారీ

Published : Oct 27, 2018, 11:03 AM IST
టీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఈసీ...ప్రతిపక్షాల ఫిర్యాదుతో నోటీసులు జారీ

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలపై ఈసీ ఓ కన్నేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఉళ్లంఘనలు జరక్కుండా కట్టుదిట్టంగా వ్యవహరింస్తోంది.  ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం, సభలు ఇలా ఏ విషయంపై ఫిర్యాదులు వచ్చినా ఈసీ అధికారులు వెంటనే స్పందిస్తున్నారు.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకలాపాలపై ఈసీ ఓ కన్నేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలాంటి ఉళ్లంఘనలు జరక్కుండా కట్టుదిట్టంగా వ్యవహరింస్తోంది.  ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం, సభలు ఇలా ఏ విషయంపై ఫిర్యాదులు వచ్చినా ఈసీ అధికారులు వెంటనే స్పందిస్తున్నారు.

ఇలా తాజాగా ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదు మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇలా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈసీ ఓ రాజకీయ పార్టీకి అందులోనూ అధికార పక్షానికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో గల క్లబ్ హౌస్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఈ ప్రాంతంలో పార్టీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా అధికార పార్టీ నేతలు ఎన్నికల నియమాలను ఉళ్లంగిచారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేశవరావుకు నోటీసులు జారీ చేసింది. ఆయన సమాధానాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని ఈసీ తెలిపింది.  
 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu