తెలంగాణలో ఎంసెట్: ఆగష్టు 5 నుండి 9 వరకు పరీక్షలు

Published : Jun 21, 2021, 05:39 PM ISTUpdated : Jun 21, 2021, 06:37 PM IST
తెలంగాణలో ఎంసెట్: ఆగష్టు 5 నుండి 9 వరకు పరీక్షలు

సారాంశం

 ఈ ఏడాది ఆగష్టు 5 నుండి 9వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి  సోమవారం నాడు ప్రకటించింది.  ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. 


హైదరాబాద్: ఈ ఏడాది ఆగష్టు 5 నుండి 9వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి  సోమవారం నాడు ప్రకటించింది.  ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. 

వాస్తవానికి ఈ ఏడాది జూలై 5 నుండి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే  కరోనా కేసుల ఉధృతి కారణంగా ఎంసెట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.  ఈ  నెల 3వ తేదీ వరకు ధరఖాస్తుల స్వీకరణకు తొలుత గడువు ఇచ్చారు. ఆ గడువును తర్వాత పెంచారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మళ్లీ  కాంపిటిటీవ్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకొంది.  ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆగష్టు 11 నుండి 14 వరకు పీజీఈ సెట్, ఆగష్టు 19, 20 తేదీల్లో ఐ సెట్, ఆగస్టు 23న లా సెట్ నిర్వహించనున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.