తెలంగాణలో ఎంసెట్: ఆగష్టు 5 నుండి 9 వరకు పరీక్షలు

Published : Jun 21, 2021, 05:39 PM ISTUpdated : Jun 21, 2021, 06:37 PM IST
తెలంగాణలో ఎంసెట్: ఆగష్టు 5 నుండి 9 వరకు పరీక్షలు

సారాంశం

 ఈ ఏడాది ఆగష్టు 5 నుండి 9వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి  సోమవారం నాడు ప్రకటించింది.  ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. 


హైదరాబాద్: ఈ ఏడాది ఆగష్టు 5 నుండి 9వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి  సోమవారం నాడు ప్రకటించింది.  ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది. 

వాస్తవానికి ఈ ఏడాది జూలై 5 నుండి ఎంసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే  కరోనా కేసుల ఉధృతి కారణంగా ఎంసెట్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.  ఈ  నెల 3వ తేదీ వరకు ధరఖాస్తుల స్వీకరణకు తొలుత గడువు ఇచ్చారు. ఆ గడువును తర్వాత పెంచారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మళ్లీ  కాంపిటిటీవ్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకొంది.  ఆగస్టు 5 నుండి 9వ తేదీ వరకు ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఆగష్టు 11 నుండి 14 వరకు పీజీఈ సెట్, ఆగష్టు 19, 20 తేదీల్లో ఐ సెట్, ఆగస్టు 23న లా సెట్ నిర్వహించనున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు