జూలై 1 నుండి 10 వరకు పల్లె ప్రగతి: కేసీఆర్

Published : Jun 21, 2021, 04:55 PM IST
జూలై 1 నుండి 10 వరకు పల్లె ప్రగతి: కేసీఆర్

సారాంశం

 జూలై 1 నుండి 10వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.   

వరంగల్: జూలై 1 నుండి 10వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. వరంగల్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్  సోమవారం నాడు పాల్గొన్నారు.  ఈ విషయమై ఈ నెల 26వ తేదీన హైద్రాబాద్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో  సమావేశం నిర్వహించనున్నట్టుగా సీఎం చెప్పారు. 

also read:కరోనాపై దుష్ప్రచారం వద్దు: మీడియాకు కేసీఆర్ చురకలు

ఈ సమావేశంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించి ప్లాన్ రూపొందిస్తామన్నారు. స్థానిక సంస్థలకు జూలై మాసం నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు.పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరిత హరం కార్యక్రమాలను కలిపి నిర్వహిస్తామన్నారు.  వరంగల్ జిల్లాలో పుట్టిన జయశంకర్ గురించి ఈ సమావేశంలో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. 

 జయశంకర్ తో  తనకున్న అనుబంధాన్ని ఆయన  గుర్తు చేసుకొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు జయశంకర్ బతికి ఉంటే బాగుండేందన్నారు.  తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో జయశంకర్ పాత్ర గురించి ఆయన ప్రస్తావించారు.
 

PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu