తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. (వీడియో)

Published : Oct 10, 2023, 11:35 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి శోభ.. (వీడియో)

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకోసం  సోమవారం సాయంత్రమే కేసీఆర్ సతీమణి శోభ కొందరు కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె తిరుమలలో తలనీలాలను సమర్పించారు. అనంతరం మంగళవారం వేవజామున అర్చన సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర పటాన్ని బహూకరించారు. ఇక, కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న సమయంలో.. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్ని దగ్గరుండి చూసుకున్నట్టుగా తెలుస్తోంది. 
 

 

PREV
click me!

Recommended Stories

CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్