కారణమిదీ: ఎల్లుండి తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ టూర్

Published : Aug 29, 2022, 08:55 PM IST
 కారణమిదీ: ఎల్లుండి తెలంగాణ సీఎం కేసీఆర్  బీహార్ టూర్

సారాంశం

ఎల్లుండి తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.  హైద్రాబాద్ నుండి ఉదయమే సీఎం కేసీఆర్ పాట్నాకు వెళ్తారు. గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన బీహార్ కు చెందిన జవాన్లకు పరిహారం చెల్లించనున్నారు. 


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  ఈ నెల 31న బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బుధవారం నాడు ఉదయం హైద్రాబాద్ నుండి సీఎం పాట్నాకు వెళ్తారు. గతంలో ప్రకటించిన విధంగానే  గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బీహార్ రాష్ట్రానికిచెందిన ఐదుగురు భారత సైనిక కుటుంబాలకు కేసీఆర్ ఆర్ధిక సహాయం చేయనున్నారు. ఇటీవల సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన  బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా కేసీఆర్ ఆర్ధిక సహాయం అందిస్తారని అధికారులు తెలిపారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి కేసీఆర్ చెక్కులు అందిస్తారు. 

బీహార్ సీఎం నితీష్ కుమార్ నివాసంలో మధ్యాహ్నం కేసీఆర్  భోజనం చేస్తారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చించనున్నారు. నితీష్ కుమార్ ఇటీవలనే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. బీజేపీతో దోస్తీని  వదిలేసి ఆర్జేడీతో జతకట్టారు. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో నితీష్ కుమార్ తో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. నితీష్ కుమార్ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారుఈ తరుణంలో నితీష్ కుమార్ తో  కేసీఆర్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu