
ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ (kcr) రాశారు. ఉక్రెయిన్లో 700 మంది తెలంగాణ విద్యార్ధులు మెడిసిన్ (medicine students in ukraine) చదువుతున్నారని.. కోర్సు పూర్తవ్వకుండానే ఇక్కడికి వచ్చేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల కోర్సుల పూర్తికి ఫీజులు భరించాలని తాము నిర్ణయించామని.. దీనిపై త్వరగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు.
కాగా.. Ukraine నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్ధులు ఇటీవల supreme Court ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో petition వేసిన వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ విద్యార్ధులున్నారు.ఉక్రెయిన్ లో తాము అసంపూర్తిగా వదిలేసిన కోర్సులను భారత్ లో పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్ధులు కోరుతున్నారు. భారత్ లో ఈ కోర్సులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని విద్యార్ధులు కోరారు. 2 వేల మందికి న్యాయం చేయాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో విద్యార్ధులు కోరారు.
ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ప్రారంభించి నెల రోజులు దాటింది.దీంతో ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుకొనేందుకు వెళ్లిన భారత విద్యార్ధులు ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే దదువును మధ్యలోనే వదిలేసి రావాల్సి వచ్చింది. ఉక్రెయిన్ లో ఇప్పటికిప్పుడే సాధారణ పరిస్థితులు వచ్చేలా లేవు. దీంతో తమ చదువు గురించి వైద్య విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ఇండియాలోనే తాము చదువుకొనేందుకు అవకాశం కల్పించాలని వైద్య విద్యార్ధులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ చదువు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టును ఆ పిటిషన్ లో వైద్య విద్యార్ధులు కోరారు.
అయితే ఇప్పటికే ఉక్రెయిన్ నుండి తెలంగాణ నుండి వచ్చిన విద్యార్ధులను చదువు కోసం అయ్యే ఖర్చును భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్య విద్యార్ధుల చదువు విషయంలో సానుకూలంగా స్పందించింది.
ఇకపోతే.. ఉక్రెయిన్ నుండి వచ్చిన వైద్య విద్యార్ధులు ఈ నెల 12న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తాము వైద్య విద్యను పూర్తి చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు.భారతదేశంలో వైద్య విద్యను పొందే హక్కు, కొనసాగించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం ఉందని పేర్కొన్నారు.ఉక్రెయిన్ నుంచి 20 వేల మంది భారత వైద్య విద్యార్థులు తిరిగి వచ్చారు. యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేనందున వారి చదువుపై అనిశ్చితి నెలకొందని విద్యార్ధుల తరఫున కేసు వేసిన ప్రవాసీ లీగల్ సెల్ పేర్కొంది. కాగా ఉక్రెయిన్లో పరిస్థితులు చూసిన తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లాలని లేదని, కేంద్ర ప్రభుత్వమే తమకు ఓ దారి చూపుతుందని కొంతమంది విద్యార్థులు భావిస్తున్నారు.