మహిళా, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టండి.. మోడీకి కేసీఆర్ లేఖ

Siva Kodati |  
Published : Sep 15, 2023, 05:35 PM IST
మహిళా, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టండి.. మోడీకి కేసీఆర్ లేఖ

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ లేఖ రాశారు.

ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ లేఖ రాశారు. మహిళా బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లులపై 2014లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు కేసీఆర్. 

కాగా.. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లుల విషయంలో అనుసరించాల్సిన వైఖరిపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Heavy Rain Alert : రుతుపవనాలు అలర్ట్, అల్పపీడనం క్రియేట్, ద్రోణి, ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాలపై ఇక వర్షాల దండయాత్రే, ఈదురుగాలులతో దబిడిదిబిడే
Kalvakuntla Kavitha: కొడంగల్‌లో 22 వేల డూప్లికేట్ ఓట్లు? కవిత సంచలన కామెంట్స్| Asianet News Telugu