ఇక్కడవి అమ్మేసి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటావా, బయ్యారంలో ఫ్యాక్టరీ పెట్టొచ్చుగా : కేసీఆర్‌పై భట్టి విమర్శలు

Siva Kodati |  
Published : Apr 11, 2023, 06:41 PM IST
ఇక్కడవి అమ్మేసి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటావా, బయ్యారంలో ఫ్యాక్టరీ పెట్టొచ్చుగా : కేసీఆర్‌పై భట్టి విమర్శలు

సారాంశం

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇక్కడ అమ్మకానికి పెట్టి.. స్టీల్ ప్లాంట్ కొంటావా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ పెట్టే శక్తి వుంటే బయ్యారంలో పెట్టాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. విశాఖ వద్దు బయ్యారం ముద్దు అన్నదే తమ నినాదమని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను పక్కదోవ పట్టించడం కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే సింగరేణిలో ఎన్నికలు నిర్వహించడం లేదని.. సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో ఎంతోమంది కార్మికుల ఉద్యోగాలు పోతున్నాయని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. ప్రాణహిత ప్రాణం తీశారని.. ఇక్కడి ఇసుకను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు దోపిడీ చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. 

అంతకుముందు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని అధికార మోదీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నష్టాలను అందరికీ పంచి.. లాభాలను కొందరికి అంకితం చేయాలనే కేంద్ర ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమనేది తెలంగాణ సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో వివరంగా తెలియజేశారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పరంగా కూడా కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేశారు.  రైతు బీమాను ప్రవేశపెట్టినప్పుడు ప్రైవేట్ సంస్థలు ఉన్నప్పటికీ.. ఎల్‌ఐసీ అప్పగించారని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేయడాన్ని మాటల్లోనే కాకుండా.. చేతల్లో చూపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు.

Also Read: సమీపంలోని బయ్యారంకు కుదరదు.. కానీ 1800 కి.మీ దూరంలోని ముంద్రాకు ఎలా సాధ్యం?: కేటీఆర్

బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటును పరిశీలిస్తామని విభజన చట్టంలోనే  ఉందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు పెడతామని కేంద్రం  చెప్పిందని తెలిపారు. 2014 నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం పోరాడుతూనే ఉన్నామనిచెప్పారు. కేంద్ర మంత్రులను కలిసిన ఎలాంటి  ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. తాను స్వయంగా ప్రధానిని  కలిశానని చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ పెడితే 15 నుంచి 20 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపానని అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్ బయ్యారానికి సరఫరా చేస్తే బాగుంటుందని చెప్పానని తెలిపారు. 

బయ్యారం సమీపంలో బైలదిల్లా ఉందని.. అది 134 కోట్ల మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ లభించే గని అని అన్నారు. అయితే అప్పుడు కుట్ర జరుగుతుందని తమకు తెలియదని చెప్పారు. బైలదిల్లాను అదానీకి  కట్టబెట్టారని.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు చావు దెబ్బతిన్నాయని అన్నారు. అందుకే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఆచరణ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతారని విమర్శించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?