హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నవ చండీయాగం.. హాజరైన చంద్రబాబు నాయుడు..

Published : Jan 10, 2023, 01:56 PM IST
హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నవ చండీయాగం.. హాజరైన చంద్రబాబు నాయుడు..

సారాంశం

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవారం దశ మహా విద్యాపూర్వక నవ చండీయాగం నిర్వహించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో వేదపండితులు ఈ యాగం జరిపించారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో మంగళవారం దశ మహా విద్యాపూర్వక నవ చండీయాగం నిర్వహించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో వేదపండితులు ఈ యాగం జరిపించారు. ఈ యాగంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. అలాగే టీ టీడీపీకి చెందిన రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, నర్సిరెడ్డి‌తో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ యాగంలో పాల్గొన్నారు. టీడీపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, అవరోధాలు తొలగిపోవాలని ఈ యాగం నిర్వహిస్తున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఇక, తెలంగాణ టీడీపీ అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలలో కదలిక వచ్చింది. గత నెలలో ఖమ్మంలో చంద్రబాబు నాయుడు సభను కూడా నిర్వహించారు. ఈ సభ విజయవంతం కావడంతో.. రాష్ట్రంలో సత్తా చాటాలనే లక్ష్యంతో ప్రణాళికలను మరింతగా వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే త్వరలోనే ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్‌లో కూడా సభ నిర్వహించాలని టీ టీడీపీ భావిస్తోంది. ఇక, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి పార్టీలోకి రావాలని ఖమ్మంలో జరిగి సభ వేదికగా చంద్రబాబు ఆహ్వానించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu
Harish Rao Serious Comments on Revanth Reddy | BRS VS CONGRESS | Politics | Asianet News Telugu