తారామతిపేట్ హత్యాచారం కేసులో ట్విస్ట్: బంగారం కోసమే ఘాతుకం, భర్తనూ చంపేందుకు స్కెచ్

Siva Kodati |  
Published : Nov 24, 2021, 03:06 PM ISTUpdated : Nov 24, 2021, 03:09 PM IST
తారామతిపేట్ హత్యాచారం కేసులో ట్విస్ట్: బంగారం కోసమే ఘాతుకం, భర్తనూ చంపేందుకు స్కెచ్

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తారామతిపేట్ మహిళ అత్యాచారం, హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మహిళలను అత్యాచారం చేసి, ఆమె ఆభరణాలను అపహరించారు దుండగులు. నిందితులు శ్రీకాంత్, సురేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తారామతిపేట్ మహిళ అత్యాచారం, హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మహిళలను అత్యాచారం చేసి, ఆమె ఆభరణాలను అపహరించారు దుండగులు. నిందితులు శ్రీకాంత్, సురేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే  మహిళ భర్తను కూడా హత్య చేసేందుకు నిందితులిద్దరూ ప్లాన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మద్యానికి బానిసై అత్యాచారం చేసినట్లు పోలీసులు తేల్చారు. 

కాగా.. హైదరాబాద్ శివారు Abdullapur Met మండలం తారామతిపేట్ ఓ వివాహితపై ఇద్దరు దుండగులు పాశవికంగా rape చేసిన సంగతి తెలిసిందే. తరువాత ఆమెను దారుణంగా murder చేశారు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడే ముందు ఆమె భర్తకు మద్యం తాగించి.. భార్యపై ఈ దారుణానికి పాల్పడ్డారు. 

ఇదిలా ఉండగా, తమిళనాడులో పవిత్రమైన వృత్తిలో ఉన్న ఇద్దరు వైద్యులు అపవిత్ర చేష్టలకు పాల్పడ్డారు. సాటి మహిళా వైద్యురాళ్ల మీద అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. చివరికి విధుల నుంచి డిస్మిస్ అయ్యి కటకటాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. covid-19 సమయంలో చాలా మంది వైద్యులు స్టార్ హోటల్ లో 15 రోజుల Quarantine గడిపారు. 

Also Read:హైదరాబాద్ లో దారుణం.. భర్తకు మద్యం తాగించి, భార్యమీద హత్యాచారం..

గత AnnaDMK ప్రభుత్వ హయాంలో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటటీ ఆస్పత్రికి చెందిన ఇద్దరు lady doctors చెన్నై టీ నగర్ లోని ఒక స్టార్ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్నారు. అదే hotel లో క్వారంటైన్ లో ఉన్న వెట్రిసెల్వన్ (35), మోహన్ రాజ్ (28) అనే ఇద్దరు డాక్టర్లు.. ఆ మహిళా వైద్యురాళ్ల గదిలోకి ప్రవేశించారు. వారిని అరిస్తే చంపుతానని బెదిరించి.. వారిమీద rape attemptకి పాల్పడ్డారు. 

అంతటితో ఆగలేదు. ఆ లైంగిక దాడిని వీడియో తీశారు. అది చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ పులమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఆ sexual harrassements ఆగకపోతుండడంతో.. చివరికి వారు తట్టుకోలేకపోయారు. ఆరోగ్యశాఖ మంత్రి, ప్రిన్సిపల్ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకుని ప్రభుత్వాధికారులు షాక్ అయ్యారు. ఆ తరువాత దీనిమీద దర్యాప్తుకు ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

Breezer: నో స్టాక్‌.. తెలంగాణ బ్రీజ‌ర్లు ఎందుకు దొర‌క‌డం లేదో తెలుసా.?
Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్