రేవంత్‌కి సుప్రీంలో ఊరట: సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని ఆదేశం

Published : May 28, 2021, 01:41 PM ISTUpdated : May 28, 2021, 01:56 PM IST
రేవంత్‌కి సుప్రీంలో ఊరట: సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని ఆదేశం

సారాంశం

 ఓటుకు నోటుకు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.   

న్యూఢిల్లీ: ఓటుకు నోటుకు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ వీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంతలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ చేసింది. ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయ్యేవరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ విషమయై నాలుగు వారాల్లో  సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

also read:ఓటుకు నోటు కేసు: సుప్రీంకోర్టుకు ఎక్కిన రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు ఊరట

also read:ఓటుకు నోటు కేసులో రేవంత్ కి షాక్:చార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ

 

ఏసీబీ చార్జీషీట్ ఆధారంగా  ఈడీ రేవంత్ రెడ్డిపై చార్జీషీట్ దాఖలు చేసింది. ఈడీ చార్జీషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో సాక్షులందరి చీప్ ఎగ్జామినేషన్ పూర్తైన తర్వాతే క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.  ఈ వినతిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రేవంత్ రెడ్డి  దాఖలు చేసిన పిటిషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. 

PREV
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu