తన ప్రైవేట్ అవయవాల్లో ప్లాస్టిక్ పైపులు, ఇనుప రాడ్డు జొప్పించుకొని...

Published : Jul 23, 2018, 11:27 AM IST
తన ప్రైవేట్ అవయవాల్లో ప్లాస్టిక్ పైపులు, ఇనుప రాడ్డు జొప్పించుకొని...

సారాంశం

తాగిన మైకంలో ఓ వ్యక్తి తనపై తానే అత్యంత క్రూరంగా వ్యవహరించుకున్నాడు. తన మల ద్వారంలోకి ఇనుప రాడ్డును జొప్పించుకుని అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించాడు. అయితే ఈ వింతైన, అసహజ చర్య చివరికి  అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

తాగిన మైకంలో ఓ వ్యక్తి తనపై తానే అత్యంత క్రూరంగా వ్యవహరించుకున్నాడు. తన మల ద్వారంలోకి ఇనుప రాడ్డును జొప్పించుకుని అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరించాడు. అయితే ఈ వింతైన, అసహజ చర్య చివరికి  అతడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లోని బోరబండ వీఆర్ నగర్ లో కృష్ణ(60) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇతడు తాగుడుకు బానిసయ్యాడు. దీంతో ఈ నెల 20 న ఫుల్లుగా తాగివచ్చిన కృష్ణ తీవ్ర మలబద్దకంతో భాదపడుతూ అసహజ చర్యలకు పాల్పడ్డాడు. తన మల ద్వారంలోకి ఓ ప్లాస్టిక్ పైపును జొప్పించాడు. దీంతో అది అందులో ఇరుక్కుపోవడంతో మళ్లీ దాన్ని బయటకు తీయడానికి ఓ ఇనుప రాడ్ ను కూడా జొప్పించాడు. ఈ రెండు అందులోనే ఇరుక్కుని తీవ్ర రక్తస్రావం అయ్యింది.
 
ఈ విషయాన్ని గమనించి కుటుంబసభ్యులు అతడిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడికి డాక్టర్లు ఆపరేషన్ చేసి ఈ రెండు వస్తువులను బయటకు తీశారు. అయినప్పటికి అప్పటికే అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కృష్ణ చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

PREV
click me!

Recommended Stories

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జూన్ 2వ తేదీ చాలా కీల‌కం.. ప్ర‌తీ కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల‌తో పాటు మరెన్నో
తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్న ఎండలు AP Telangana Weather News| Asianet News Telugu