కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు : ఏడెనిమిది రోజుల్లో తెలంగాణలో ప్రవేశం

Published : May 29, 2018, 04:06 PM IST
కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు :  ఏడెనిమిది రోజుల్లో తెలంగాణలో ప్రవేశం

సారాంశం

మూడు రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు

మండుటెండల వల్ల విసిగిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఇవాళ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రుతుపవనాలు ఏడెనిమిది రోజుల్లో తెలంగాణ ను తాకనున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.

జూన్ 1 న ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు ఇదివరకే ఐఎండీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నిన్న అండమాన్‌ నికోబార్‌ దీవులను పూర్తిగా ఆవరించిన ఈ రుతు పవనాలు వేగంగా ముందుకు కదిలాయి.  వాతావరణం ఈ రుతుపవనాలకు సహకరించడంతో మూడు రోజుల ముందే కేరళ తీరాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు.

రుతుపవనాల రాకతో కేరళలో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నైరుతి రాకతో దేశంలో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.  

ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇదే అనుకూల వాతావరణం కొనసాగితే సకాంలోనే తెలంగాణకు రుతుపనాలు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Holidays : తెలంగాణ ఉద్యోగులకు బంపరాఫర్... ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు సెలవే..!
CM Revanth Reddy Super Speech: ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ | TS Congress | Asianet News Telugu