గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. రైలు నిలిపివేత, భయాందోళనలో ప్రయాణికులు

Siva Kodati |  
Published : Mar 15, 2023, 08:43 PM IST
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. రైలు నిలిపివేత, భయాందోళనలో ప్రయాణికులు

సారాంశం

హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడం కలకలం రేపుతోంది. ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరిన కాసేపట్లో పొగలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. దీంతో లోకో పైలట్ రైలును మౌలాలి స్టేషన్‌లో నిలిపివేశారు. అయితే మరమ్మత్తుల అనంతరం గోదావరి ఎక్స్‌ప్రెస్ తిరిగి బయల్దేరింది. అయితే ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu